ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 9:02 am Posted by : Shiva Kumar BS

ఖైరతాబాద్‌లో పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహ తయారీకి శ్రీకారం

ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : ఖైరతాబాద్‌లో ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి పంచముఖ సంకటహర మహాగణపతి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ ప్రత్యేక రూపంలో ఐదు ముఖాలతో గణనాథుడు కొలువుదీరనున్నారు.

నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా కర్రపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పూజతో మహాగణపతి విగ్రహ తయారీ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ఖైరతాబాద్ గణపతి విగ్రహ నిర్మాణం ప్రారంభం కావడంతో ఉత్సవాల సందడి మొదలైంది.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్, రాజ్ కుమార్, వీణ మాధురి, సందీప్ రాజ్, బాల్‌కుమార్, రాచప్ప, రాము, సతీష్, రాజ్, వినోద్, సాయి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు.