బూర్గుల గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం..
చిన్నారుడికి పోలియో చుక్కలు వేస్తున్న అంగన్వాడీ టీచర్ కే. శ్రీలత
షాద్ నగర్ : పోలియో నివారణకు రెండు చుక్కలు నిండు జీవితం అనే సందేశంతో 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కల వేయాలని బూర్గుల అంగన్వాడీ టీచర్ శ్రీలత అన్నారు.ఆదివారం ఫరూఖ్ నగర్ మండలంలోని బూర్గుల పీహెచ్ సి లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలియో నివారణలో భాగంగా o నుండి 5 సంవత్సారాల వయస్సు గల పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు.ఈ కార్యక్రమంలో,ఆశ వర్కర్ సునీత మమత తదితరులు పాల్గొన్నారు.