#HYDERABAD టాస్క్ఫోర్స్ పోలీసులు ఏడాది నెల రోజులుగా పరారీలో ఉన్న రౌడీ షీటర్ మహ్మద్ షేక్ జావేద్ (33)ను అరెస్టు చేశారు. హత్య కేసు, నాన్బెయిలబుల్ వారెంట్ నుంచి తప్పించుకునేందుకు అతడు సంగారెడ్డి జిల్లాలో పీర్ బాబా వేషంలో దర్గాలో పూజారిగా ఉంటున్నాడు. పూల్బాగ్ వద్ద పట్టుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి 115 గ్రాముల డ్రై గంజాయి, బాబా వేషధారణ దుస్తులు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.