మల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్‌లోకి భారీగా యువత చేరికలు

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా ఆదాబ్ సైబరాబాద్ , మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీలో భారీగా యువత చేరారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో సైనిక్‌పురి, నేరేడ్మెట్, వెంకటాపురం డివిజన్లకు చెందిన పలువురు యువకులు, వివిధ పార్టీల నాయకులు గులాబీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో యువత బీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషకరమన్నారు. యువత భాగస్వామ్యంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, నియోజకవర్గ...