ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసిన కాలనీవాసులు
మల్కాజిగిరి: మల్కాజిగిరి నియోజకవర్గంలోని వినాయక్నగర్ డివిజన్ దీన్దయాళ్ నగర్ రోడ్ నెం.2 కాలనీవాసులు స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులను సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తులసి సురేష్, సాయి సాగర్, రాజగోపాల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.