ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి, సలహాదారు, ముఖ్యమంత్రి ఎక్స్-అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన కె. రామకృష్ణా రావు కూడా పాల్గొన్నారు.
