వికారాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు విడుదలయ్యేలా చర్యలు తీసుకున్న ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులకు తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ వికారాబాద్ జిల్లా కమిటీ ప్రత్యేక విప్లవ అభినందనలు తెలిపారు. కార్మికుల జీతాల చెల్లింపునకు చొరవ చూపిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బందికి యూనియన్ తరఫున బుధవారం ఉదయం కృతజ్ఞతలు తెలిపారు. రెండు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉండటంతో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జీతాల విడుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే కార్మికుల సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లిన విలేకరులకు, సమస్య పరిష్కారం కోసం సహకరించిన కార్మికులకు, ఇతరులకు కూడా యూనియన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు.
