నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవనంలో ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, రైతులకు అవసరమైన ముందస్తు సన్నాహకాలపై ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఎస్పీలు తదితర అధికారులు పాల్గొని ఎల్ నినో పరిస్థితులపై తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.
