e-Paper
Sunday, September 13, 2026
Homeక్రైమ్ న్యూస్నకిలీ పత్రాలతో రూ.4.11 కోట్ల గృహ రుణాల మోసం..8 మంది అరెస్ట్

నకిలీ పత్రాలతో రూ.4.11 కోట్ల గృహ రుణాల మోసం..8 మంది అరెస్ట్

📰 Generate e-Paper Clip

 

ఆదాబ్ సైబరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, :
నకిలీ స్థిరాస్తి పత్రాలను సృష్టించి వివిధ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను మోసం చేసి రూ.4.11 కోట్ల విలువైన గృహ రుణాలు పొందిన మోసాన్ని కీసర పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

దర్యాప్తులో భాగంగా నిందితుల వద్ద నుంచి నకిలీ ఆస్తి పత్రాలు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు రికార్డులు తదితర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను నమ్మబలికి భారీ మొత్తంలో రుణాలు పొందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ మోసానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్న పోలీసులు, కేసులో పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!