e-Paper
Thursday, September 17, 2026
Homeజాతియంవిద్యను వ్యాపారంగా మార్చింది బీజేపీ ప్రభుత్వం: మహేశ్ కుమార్ గౌడ్

విద్యను వ్యాపారంగా మార్చింది బీజేపీ ప్రభుత్వం: మహేశ్ కుమార్ గౌడ్

📰 Generate e-Paper Clip

దేశంలోని విద్యా విధానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యాపారంగా మార్చిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ బోయినపల్లిలో నిర్వహించిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్య అందరికీ అందుబాటులో ఉండే హక్కు అని, దానిని కార్పొరేట్ సంస్థలకు పరిమితం చేసే విధానాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కన్వీనర్, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యా రంగాన్ని బలోపేతం చేసి విద్యార్థుల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని నాయకులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!