ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీ పునరుద్ధరణ డిమాండ్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం ఢిల్లీకి బయలుదేరింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసి వినతిపత్రం అందజేయనున్నారు. ఈ బృందంలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి నాయకులు ఉన్నారు. అనంతరం కేటీఆర్ ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.
